13 July, 2026 | 9:57 PM

Breaking News

కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •  

టీటీడీ ఎవరి ఆస్తి కాదు.. హిందువులది మాత్రమే

11-07-2025 10:39 AM

తిరుమల: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజలు సనాతన ధర్మం కోసం కలిసికట్టుగా ఉండాలని ప్రార్థించానని బండి సంజయ్ పేర్కొన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను టీటీడీ రక్షించాలని బండి సంజయ్ కోరారు. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని చెప్పారు. కొండగట్టు అంజన్న క్షేత్రం, కరీంనగర్ రామాలయాలు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాల అభివృద్ధి చేయాలని టీటీడీ ఛైర్మన్(TTD Chairman)కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

టీటీడీలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు అన్య మతస్థులు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. అన్ని మతాలకు టీటీడీ సత్రం కాదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగం ఉన్నవారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఎవరి ఆస్తి కాదు.. హిందువులది మాత్రమే అన్నారు. ఎర్రచందనం(Red Sandalwood Smuggling) దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్(Bandi Sanjay) హెచ్చరించారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామన్నారు. స్వామివారిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయింది.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సేవకుల పాలన వచ్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.