15 April, 2026 | 1:41 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ఆగని ఇన్‌ఫార్మర్ హత్యలు

27-10-2025 12:38 AM

ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు 

చర్ల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఇన్‌ఫార్మర్స్ నెపంతో ఇద్దరు యువకులను మావోయిస్టులు హతమార్చారు. ఓ పక్క మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ అత్యంత దూకుడుగా సాగుతున్న వేళ చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్‌ఫార్మర్ నెపంతో శనివారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశారు.

జిల్లాలోని ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేల కాంకేర్ గ్రామానికి చెందిన రవి కట్టం(25), తిరుపతి సోడి (38)లను పదునైన ఆయుధలతో హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ సాగిస్తున్నారు. ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున బలగాలను తరలించారు.