3 July, 2026 | 10:11 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మండల కేంద్రంలో ఆగని ఇసుక దందా

08-09-2025 01:48 AM

రాజాపూర్ సెప్టెంబర్ 7: మండల కేంద్రంలో దుందుభి నది పరివాహ ప్రాంతం లో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా జోరుగా సాగుతుంది. వాగు పరిసర ప్రాంతాల్లో యంత్రాలతో మట్టినితోవి కృత్రిమంగా ఇసుకను తయారుచేసి రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

పక్కనే కస్తూరిబా గురుకుల పాఠశాల ముందర నుంచి ఇసుక ట్రాక్టర్లు టిప్పర్రు వెళ్లడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గం ధ్వంసం కావడంతో ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.