8 July, 2026 | 8:36 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో వాల్మీకి జయంతి వేడుకలు

07-10-2025 08:18 PM

మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ టిఎస్ విఎన్ త్రిలేశ్వరావు, సిబ్బందితో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి సంస్కృత భాషకు ఆదికవి అని, రామాయణంను సంస్కృతంలో రాశాడని, రామకథ తరతరాలకు నిలిచిపోయే అద్భుత ఇతిహాసం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శోభా శంకర్, ఏఈ వినీల్ కుమార్, మేనేజర్ క్రాంతి కుమార్, ఆర్వో కిషోర్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ శ్రీనివాస్ నగరపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.