26 March, 2026 | 3:30 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

07-10-2025 10:42 PM

మేడ్చల్ (విజయక్రాంతి): రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం చెక్పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కోమటి ఎల్లం(35) అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టణంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కంటైనర్ 2 వాహనాలను ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరుసటి రోజు మరో ప్రమాదం జరగడంతో స్థానికులు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడుతున్నారు.