21 March, 2026 | 6:55 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

రైతులపై వరుణుడి కన్నెర్ర

26-05-2025 12:52 AM

- ఆకాలవర్షంతో తడిసిన ధాన్యం

రాజాపూర్, మే 25: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం వరుణుడి ప్రతాపానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వ ర్షానికి కల్లంలో ధాన్యం తడిసి వర్షానికి కొట్టుకుపోయిన ఏమి చేయలేని దీనస్థితి రైతులకు ఎ దురైంది.

గత వారం రోజులుగా అడపాదడపా వర్షం కారణంగా కల్లంలో ఉన్న వరిదాన్యం ఎండలేని పరిస్థితి ఏర్పడింది. ప్రతి గ్రామంలో కల్లంలోనే ధాన్యం కుప్పలు పేరుకుపోయి రైతులు కష్టం ధాన్యం మ్యాచర్ రావడం లేదని అధికారులు వడ్లు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే వర్షం పడితే మా ధాన్యం తడిసి పోయి ధాన్యం కొనుగోలు చేసేది ఎవరని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయా లని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.