calender_icon.png 31 December, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ ఫోన్ ను వినియోగించడంపై వాసవి పాఠశాల విద్యార్థుల అవగాహన ర్యాలీ

31-12-2025 06:56:17 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం సెల్ ఫోన్ ను తెలివిగా ఉపయోగించడం ఎలా అనే అంశంపై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరూ చక్కగా పాల్గొని సెల్ ఫోన్  వినియోగంపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు నృత్య ప్రదర్శనలతో, నినాదాలతో ప్రజలకు సెల్ ఫోన్ ను అనవసర విషయాలకు కాకుండా మన అవసరానికి  ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించడం జరిగింది.