06-12-2025 06:13:59 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ డిసిసి నూతన అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యంకు రాజేందర్ రావు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. పలు అంశాలపై చర్చించారు. మేడిపల్లి సత్యం నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో మరింత బలపడుతుందని రాజేందర్రావు పేర్కొన్నారు.