09-01-2026 05:37:04 PM
పెంచికల్ పెట్,(విజయ క్రాంతి): అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఎలుక పల్లి సర్పంచ్ భక్తురాంచందర్ అన్నారు. శుక్రవారం గ్రామపంచాయతీలో మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పలు సమస్యలను గ్రామసభలో ప్రస్తావించగా సర్పంచ్ స్పందించి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిల్ కార్యదర్శి చంద్రశేఖర్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.