14 April, 2026 | 1:19 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

25-11-2025 07:43 PM

బాన్సువాడ పట్టణ ఎస్‌హెచ్‌ఓ తుల శ్రీధర్

బాన్సువాడ,(విజయక్రాంతి): ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ పట్టణ ఎస్‌హెచ్‌ఓ తుల శ్రీధర్ హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు కోసం ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ నియమాలను వివరించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న వ్యాపార సముదాయాలను సందర్శించి, వ్యాపార యజమానులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... రోడ్డు మీదకు దుకాణాలను విస్తరించడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఇలాంటి చర్యలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రోడ్డు ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నందున యజమానులు వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.