12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

పేదలకు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలి

11-10-2025 06:51 PM

గూడెం మధుసూదన్ రెడ్డి 

పటాన్ చెరులో విజె లీగల్ అసోసియేట్స్ కార్యాలయం ప్రారంభం

పటాన్ చెరు: పేదలకు సులభంగా సత్వర న్యాయం అందించేందుకు ప్రైవేట్ లీగల్ అసోసియేట్స్ సంస్థలు కృషి చేయాలని సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎంపీడీవో షాపింగ్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజె లీగల్ అసోసియేట్స్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వాహకులు అడ్వకేట్ విజయభాస్కర్ ను అభినందించారు. అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో కోర్టులు, చట్టాల పట్ల అవగాహన పెంపొందించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, సీనియర్ అడ్వకేట్ యాదగిరి యాదవ్, దస్తగిరి, భాస్కర్ రావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.