10 April, 2026 | 3:56 PM

Breaking News

అభివృద్ధి పథంలో భాగ్యనగర్ తండ గ్రామపంచాయతీ   •   టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •  

గురుకుల్ కళాశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

05-11-2025 12:06 AM

ఘట్ కేసర్, నవంబర్ 4 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ గురుకుల్ కళాశాలలో గురుకుల పరిరక్షణలో భాగంగా గురుకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్  సహకారంతో ఓ.ఎన్.జి.సి వారి సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ను తన సొంత ఖర్చులతో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి  గురుకుల్ కళాశాలలో దాన్ని మరమ్మత్తు చేసి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జేఏసీ కన్వీనర్ మారo లక్ష్మారెడ్డి తో కలిసి మంగళవారం ప్రారంభించడం జరిగింది.

విద్యార్థులు సేవ్ గురుకుల్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గురుకుల్ పరిరక్షణ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మరుగుదొడ్ల పనులను పర్యవేక్షించి త్వరలో విద్యార్థులకు అందుబాటులో వచ్చేటట్టు చేస్తామని తెలిపారు. తన సొంత ఖర్చుతో గురుకుల్ రైల్వేగేట్ ప్రహరీగోడ అసంపూర్తిగా మిగిలి ఉన్నందున అది పూర్తి చేయుటకు తన సొంత గ్రామమైన ఘట్ కేసర్ కి  శ్రేయోభిలాషి కందకట్ల మాధవరెడ్డి ఇనుప కంచె  పనులను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు, శ్రేయోభిలాషులు, విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.