13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

యాసంగి పంటల కోసం పోచారం ప్రాజెక్టు నీటి విడుదల

09-01-2026 03:39 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): యాసంగి పంటల నిమిత్తం కోసం మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటి విడుదల చేశారు. ఇరిగేషన్ ఎస్సీ ఎస్ఎస్ శ్రీ, డిఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డీవో పార్థసింహారెడ్డి ప్రధాన గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి పోచారం  ప్రధాన కాలువ ద్వారా నీటిని దిగకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పోచారం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న పంటల నిమిత్తం కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కావున పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటిని వృధా చేయకూడదు అన్నారు. పోచారం ప్రధాన కాలువ వెంబడి కరెంటు మోటార్లు పెట్టి నీటిని వృధా చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కరెంటు మోటార్లను సీజ్ జరుగుతుందన్నారు.