10 April, 2026 | 2:31 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

ఒడిశా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

28-09-2025 01:06 AM

-ఝార్సుగూడలో 60 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

-డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రెట్టింపు వేగంతో అభివృద్ధి

-ప్రధాని నరేంద్ర మోదీ

ఝార్సుగూడ, సెప్టెంబర్ 27: ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. శనివారం ఒడిశా ఝార్సుగూడలో రూ. 60వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్లు, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, రైల్వే ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు, విద్య, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులతో పాటు మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ మొబైల్ టవర్లను జాతికి అంకితం చేశా రు.

దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ దాదాపు 97, 500 4జీ టవర్లు నిర్మించింది. ‘డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఒడిశా రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతుంది. చిప్ నుంచి షిప్ వర కు దేశం ప్రతి రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించాలనేదే మా సంకల్పం. దశాబ్దాలుగా ఒడిశా కష్టాలు ఎదుర్కొన్నా.. ఈ దశాబ్దం రాష్ట్రాన్ని సంపన్న భవిష్యత్ వైపు నడిపిస్తుంది’ అని పేర్కొన్నారు. బెర్హంపూర్‌ఉధ్నా (సూరత్) మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.