13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జోగు రామన్న అరెస్టును ఖండిస్తున్నాం

07-01-2026 12:16 AM

తలమడుగు, జనవరి 6 (విజయక్రాంతి): రైతులు పండించిన పంటలన్నింటినీ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం తాంసి, తలమడుగు మండలాల నాయకులు సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం దున్నపోతుకు వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులతో ఎస్సై రాధిక, తాంసి ఎస్‌ఐ జీవన్ రెడ్డి మాట్లాడి నిరసనను విరమింపజేయించారు.

ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఆదిలాబాద్ బంద్‌లో పోలీసులు మాజీ మంత్రి జోగు రామన్న అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సోయాబీన్‌ను కొనడం లేదనీ నిలదీస్తే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, సుంకిడి సర్పంచ్ మగ్గిడి ప్రకాష్, ప్రకాష్, కేదారేశ్వర్ రెడ్డి, రమాకాంత్ అబ్దుల్లా, తోట శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, రమణ రఘు పాల్గొన్నారు.