13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కబడ్డీ దిగ్గజం ఖాజా భాయ్ ఆశయాలను సాధించాలి

03-01-2026 12:00 AM

కోదాడ, జనవరి 2: కబడ్డీ క్రీడకు ప్రాణం పోసి జాతీయ స్థాయిలో కోదాడ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన క్రీడా మాంత్రికుడు స్వర్గీయ ఖాజా భాయ్ ఆశయాలను సాధించాలని సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఎండి మహబూబ్ జానీ అన్నారు. ఖాజా భాయ్ 36 వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ నివాసంలో అన్ని పార్టీల నాయకులు, కబడ్డీ క్రీడాకారుల ఆధ్వర్యంలో కేబి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్, ఎంఈఓ సలీం షరీఫ్, బాగ్దాద్, భాజాన్, షఫీ,శామీ, ఖాజా మొయినుద్దీన్, మాతంగి బసవయ్య, కొండలు నామా నరసింహారావు, కాంపటి శ్రీను, లాయర్ రాజన్న, పంది తిరపయ్య, గంధం పాండు, రామారావు, పిడతల శ్రీను, రహీం, ఖాజా గౌడ్, బాబా, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.