11 April, 2026 | 3:51 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

ప్రమాద రహిత ప్రయాణం దిశగా సాగాలి

10-01-2026 12:37 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): రోడ్డుపై వాహనాలు నడుపు తున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రమాద రహిత ప్రయాణం దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డిపో మెనేజరు రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ, రవాణా శాఖ, రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు జిల్లా ఎస్పీ నితిక పంత్, జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, జిల్లా ఫైర్ అధికారి భీమయ్య తో కలసి హాజరయ్యారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో కీలకమని తెలిపారు. ఆర్టీసీని ప్రమాదాల రహిత ప్రయాణంగా రూపొందించడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో ఉందన్నారు. డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిం చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, వైద్యుడు వినోద్ కు మార్, ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.