17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

‘పరిషత్’ ఎన్నికల్లో సత్తా చాటాలి

26-12-2025 02:16 AM

ఆమనగల్లు, డిసెంబర్ 25( విజయ క్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్ మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ పంచాయతీల కుచెందిన పలువురు బిజెపి పార్టీకి చెందిన నాయకులు మాజీ సర్పంచ్ అంబర్ సింగ్, మాజీ ఎంపిటిసి పరమేష్ ఆధ్వర్యంలో భారీగా నాయకులు, కార్యకర్తలు హైదరాబాదుకు తరలివచ్చి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాధారంగా పార్టీ లో కి ఆహ్వానించి పార్టీ కండువాను కప్పారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన బిజెపి పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన గుర్తు చేశారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పాత, కొత్త అనే తేడా లేకుండా పార్టీ ఆదేశాల మేరకు అందరూ సమన్వయంతో కలిసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గం లో ఇటీవల జరిగిన స్థానికపోరు లో సర్పంచ్, వార్డు సభ్యులు  మెజార్టీగా గెలుపొందారని అదే స్ఫూర్తితో వచ్చే పరిషత్ ఎన్నికల్లో కూడా కల్వకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు  మాజీ మార్కెట్ చైర్మన్ పోలేపల్లి నారాయణ, సర్పంచ్ మంగ్లీ రాములు, జిల్లా నాయకులు రవీందర్ నాయక్, సురేష్ పాల్గొన్నారు