13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బయట పంచాయతీల వారికి ఇసుక ఇవ్వం..

13-01-2026 12:01 AM

గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ 

అశ్వారావుపేట, జనవరి 12 (విజయ క్రాంతి) : అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి, కోయ రంగాపురం గ్రామ పంచాయతీలు మినహా ఇతర గ్రామ పంచాయతీల వారు పెద్ద వాగు ప్రాజెక్ట్ వాగులో ఇసుకకు రావద్దని సూచిస్తున్నారు. సోమవారం గుమ్మడవల్లి సర్పంచ్ పాయం శ్రీదేవి, కోయ రంగాపురం పంచాయతీ సర్పంచ్ సోడెం చిన్న గంగమ్మ ఇద్దరు గ్రామ పెద్దలతో కలసి వాగు నీ పరిశీలించారు. రెండు పంచాయతీల్లో అభివృద్ధిలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర భవనాలు మంజూరి అయి ఉన్నాయని వాగులో ఇసుక రెండు పంచాయతీ లకు సరిపోతుందని, అందుకే ఇతరులు ఇసుక తొలకాలకు అంగీకరించడం లేదని తెలిపారు. ఇసుక తవ్వడం వల్ల వాగు లో నీరు ఇంకిపోతుందని అన్నారు. తద్వారా బోర్లు వేస్తే నీరు అందటం లేదు అన్నారు. దయచేసి ఇతర పంచాయతీల నుండి ఇసుక కోసం ఎవ్వరు రావద్దని కోరారు.