17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మేం జోక్యం చేసుకోం

10-05-2025 02:50 AM
  1. భారత్-పాక్ శాంతియుతంగా ఉండాలి
  2. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

న్యూఢిల్లీ, మే 9: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాము కలగజేసుకోమంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చిచెప్పారు. రెండు దేశాలూ శాంతియు తంగా ఉండాలని ఆయన సూచించారు. ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లా డాతూ ఈ మేర కు కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు.

‘రెండు అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ.. భారీ సంక్షో భం దిశగా పయనించడంపై మేం ఆం దోళన వ్యక్తం చేస్తు న్నాం. సాధ్యమైనంత త్వరగా పరిస్థితులు చక్కబడాలని కోరుకుటుంటున్నాం. పాకిస్థాన్‌పై భారత్‌కు కొన్ని ఫిర్యా దులున్నాయి. న్యూఢిల్లీ చర్యలకు పాక్ స్పంది స్తోంది. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చేయాలని మేం వీరిని ప్రోత్సహించగలమే తప్ప, యుద్ధంలో మాత్రం తలదూర్చం. అది మా పని కాదు.

అమెరికాతో దానికి ఏ మా త్రం సంబంధం లేదు’ అని వాన్స్ వెల్లడించారు. అయితే, తాను, అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పారు. జేడీ వాన్స్ తన కుటుంబంతో భారత పర్యటనకు వచ్చిన సందర్భంలోనే పహల్గాం ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.