17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బిల్లులు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తాం

03-11-2025 06:28 PM

బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఛైర్మన్ రామారావు

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంట్రాక్టులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుంటే డిసెంబర్ నుంచి పనులు నిలిపివేస్తామని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఛైర్మన్ రామారావు హెచ్చరించారు. సోమవారం బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో పాటు పలుశాఖల అధికారులకు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికై బిల్లుల విషయమై మంత్రులు. ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి విన్నవించడం జరిగింది. ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారని వాపోయారు. నవంబర్ 30లోపు తమ బిల్లుల చెల్లించకుంటే  డిసెంబర్ నుంచి పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.