2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

కథా సంపుటాలకు స్వాగతం!

28-04-2025 12:00 AM

‘ఒద్దిరాజు సోదర కవుల సాహితీ పురస్కారం  కోసం వరంగల్లుకు చెందిన సహృదయ, సాహిత్య సాంస్కృతిక సంస్థ రచయితల నుంచి తెలుగు కథా సంపుటులను ఆహ్వానిస్తున్నది. 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పురస్కారం కింద రూ. 10,000/- నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు సంస్థ అధ్యక్షులు గిరిజా మనోహర బాబు, ప్రధాన కార్యదర్శి కుందావజ్జల కృష్ణమూర్తి ప్రభృతులు ఒక ప్రకటనలో తెలిపారు.

2018 జనవరి నుంచి డిసెంబర్ 2024 లోగా పుస్తక రూపంలో ప్రథమ ముద్రణ పొందిన కథా సంపుటాలు మాత్రమే ఈ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారానికి అర్హమైనవిగా వారు పేర్కొన్నారు. రచయితలు పరిశీలనార్థం తమ రచనలను (మూడు ప్రతులు) 30.05.2025లోగా పంపాలి. 

చిరునామా: డా.ఎన్.వి.ఎన్.చారి,2- విజయ గణపతినగర్, రోడ్డు నెం. 10 బి, హనుమకొండ- 506009, సెల్: 9866610429