27 March, 2026 | 2:47 AM

కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవగానే ఉపాధి కూలి పెంపు

04-05-2024 01:51 AM

ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి 

నిజామాబాద్, మే 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఉపాధి పథక కనీస వేతనాన్ని రూ.400 చేస్తామని పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. వేసవిలో 35 శాతం బోనస్ చెల్లిస్తామన్నారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ నియోజకవర్గంలోని గోవింద్‌పేట్, చేపూర్, పిప్రీ గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.