17 April, 2026 | 3:23 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రోజ్ లుక్ మార్చేదెందుకు?

09-05-2025 01:02 AM

ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంది ‘త్రీ రోజెస్’. ఓటీటీ వేదిక ఆహాలో సూపర్ హిట్ అయిన ఈ వెబ్‌సిరీస్‌కు ఇప్పుడు సీజన్2 రాబోతోంది. దీన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తుండగా.. రవి నంబూరి, సందీప్ బొల్ల కథారచన చేయగా, కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు.

త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సీజన్2 నుంచి హీరోయిన్ రాశీసింగ్ క్యారెక్టర్‌కు సంబంధించి గ్లింప్స్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఇందులో రాశీసింగ్ పాత్రను మొదట సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా పరిచయం చేశారు.

తర్వాత ఆమె ఆధునిక లుక్‌లోకి మారిపోవడాన్నీ చూడొచ్చు. మరి ఆమె ఎందుకు సంప్రదాయ అవతార్ నుంచి ఆధునిక లుక్‌లోకి మారిందనేది ఆసక్తిని రేకెత్తించింది. ఆమెలో ఈ పరివర్తన, మార్పు వెనుక గల కారణం తెలుసుకోవాలంటే ప్రేక్షకులు తమ సిరీస్‌ను చూడాల్సిందేనని టీమ్ చెప్తోంది.