1 July, 2026 | 11:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

తొమ్మిదిన్నరేండ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు!

18-09-2025 12:34 AM
  1. ఆరోగ్యశ్రీ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగదు
  2. వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదని.. ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది.

దీంతో రాష్ర్టంలోని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు తమ బకాయిలను సర్కార్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆసుపత్రులను కోరుతున్నామని చెప్పారు.

తామిచ్చిన స్వేచ్ఛను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏనాడు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయని వారు ఇప్పుడు ఎందు కు వైద్య సేవలను ఆపుతున్నారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు రూ.50 కోట్లు కూడా విడుదల కాలేదని గుర్తు చేశారు.