30 August, 2026 | 10:10 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఇందిరా మహిళా శక్తిపై విస్తృత అవగాహన

12-07-2025 12:58 AM

నిజామాబాద్, జూలై 11 :(విజయ క్రాంతి) మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల గురించి మహిళా సంఘాల సభ్యులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డీఆర్డీఓ సాయగౌద్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.పద్మశ్రీ నేతృత్వంలో తెలంగాణా సంస్కృతిక సారథి కళా బృందాలు మహిళా సాధికారత కార్యక్రమాల గురించి తమ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నాయి.

ఇందులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎం.జీ ఫంక్షన్ హాల్ లో ఒక బృందం, దొంకేశ్వర్ మండలంలోని సత్తె గంగవ్వ ఫంక్షన్ హాల్ లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. వడ్డీ లేని రుణాలు, మహిళా సాధికారత, ఉచిత బస్సు ప్రయాణం, ఆరు గ్యారంటీల అమలు, మహిళా శక్తి కాంటీన్ లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ పవర్ యూనిట్లు తదితర వాటిపై అవగాహన కల్పించారు.