16 April, 2026 | 12:07 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

దుండిగల్‌లో మహిళ దారుణ హత్య

08-11-2025 07:38 PM

కత్తితో అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన దుండగులు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): వివాహిత మహిళను పదునైన కత్తితో అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దుండిగల్ సీఐ పి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన సుజాత (30) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తడంతో భర్తతో దూరంగా ఉంటుంది.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడం,ఆ వ్యక్తితో కూడా తనకు గొడవలు జరుగుతున్నట్లు సీఐ తెలిపారు. అయితే అతనికి సంబంధించిన వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేష్ అనే వ్యక్తి మహిళను హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ తెలిపారు.