08-09-2025 09:25:32 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని కొత్త దోనబండ తండా గ్రామానికి చెందిన బానోతు మక్తి భర్త సక్రు వయస్సు 55 సంవత్సరాలు సోమవారం సాయంత్రం హుజూర్ నగర్ నుంచి దినసరి కూలీగా వెళ్ళి వేరే వ్యక్తి వాహనం పై వస్తూ ఉండగా లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ రహదారి దగ్గర ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టగా క్రింద పడటంతో వెనకనే వస్తున్న లారీ ఆ మహిళా మీదగా వెళ్లడంతో స్పాట్లో మరణించడం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయని సమాచారం మఠంపల్లి ఎస్సై పి.బాబు తన సిబ్బందితో మృత దేహాన్ని హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని,పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.