13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మున్సిపల్ కార్యాలయం ఎదుట త్రాగు నీటి కోసం మహిళల ఆందోళన

09-01-2026 04:07 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): గత వారం రోజులుగా తాము తాగు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని దర్గా కాలనీకి చెందిన ముస్లిం మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు వెంటనే త్రాగునీరు అందించాలంటూ మహిళలు అధికారులను కోరారు.

మహిళలతోపాటు, ఆ కాలనీకి చెందిన కొంతమంది  ఈ ఆందోళనలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్  మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తు పనుల దృశ్య పైప్ లైను  ధ్వంసం అయిందని, రేపటినుండి  తాగునీరు అందించి సమస్య పరిష్కారం కు  కృషి చేస్తామని కమిషనర్ చెప్పడంతో మహిళలు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు.