11-07-2025 10:39:12 PM
కాంగ్రెస్ నాయకులు ఎగుడ రాయమల్లు
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని మండల కాంగ్రెస్ నాయకులు ఎగుడ రాయమల్లు అన్నారు. శుక్రవారం మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన మహిపాల్, రాజయ్యలకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును బాదితులకు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. అంతే కాకుండా నిరుపేదల వైద్య సహాయానికి సహాయ సహకారాలు అందిస్తుందని దీనిలో భాగంగా మండలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.