17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం

22-11-2025 01:14 AM

కల్వకుర్తి టౌన్, నవంబర్ 21 : పట్టణంలోని ముదిరాజ్ భవనంలో శుక్రవారం ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ మత్స్యకార శాఖకి ప్రభుత్వం మూడు వేల కోట్లను విడుదల చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్ కులస్తులను ఆదుకోవాలన్నారు. ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏ లోకి మార్చాలని, ప్రతి సొసైటీకి చాప పిల్లలను అందించాలని, గౌడ్ అన్నలు, నేతన్నల మాదిరిగానే ముదిరాజులకు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మత్స్యకార సంఘం అధ్యక్షుడు కుంభం భీమయ్య, ఉపాధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, యువజన నేతలు కుంభం చందు ముదిరాజ్, వెంకటయ్య, తిరుపతి, సూరి, శ్రీనివా సులు, యాదగిరి, ప్రవీణ్, శ్రీను, గోపి, శ్రీకాంత్, వెంకటేష్, శ్రీధర్, భాస్కర్, బాలు, సాయి, తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోట..

కొత్తకోట, నవంబర్ 21 : కొత్తకోట పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మత్స్యకారులతో కలిసి కొత్తకోట పట్టణ అధ్యక్షులు చాపల భాస్కర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కృష్ణయ్య, మందడి సురేష్, రాజకుమార్, గిరి, ముదిరాజ్ సంఘ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.