15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇసుక అక్రమ రవాణా ఆపాలి

22-11-2025 01:12 AM

 నాగర్ కర్నూల్ నవంబర్ 21 (విజయక్రాంతి ): నాగర్ కర్నూలు జిల్లా దుందుభి వాగు పరిసర ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను నిలువరించాలని డిమాండ్ చేస్తూ ఉప్పునుంతల మండల తాసిల్దార్ సునీతకు వినతి పత్రం అందించారు.  పట్టా భూమికి మాత్ర మే పర్మిషన్ ఉన్నా, దుందుబి వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా యని అచ్చంపేట ఇంచార్జ్ ఉల్పర కృపానందం, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్, మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ తీవ్రంగా ఖండించారు.

రోజుకు 15 టిప్పర్లకు మాత్రమే అనుమతి ఉండగా, రాత్రివేళల్లో 40--50 టిప్పర్లు ఇసుక తరలింపులు జరగడంపై అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక హామీ అమలుకాలేదని, వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే భారీ రవాణా సాగుతుందని విమర్శించారు. అచ్చంపేట ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే రాత్రివేళల్లో టిప్పర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు.