15 June, 2026 | 8:25 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

జీవిత లక్ష్యం ఏర్పరచుకోవాలి

02-01-2026 12:00 AM
  1. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ దాసేశ్వరరావు 
  2. యూనివర్సిటీలో నూతన సంవత్సర వేడుకలు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని విజ్ఞాన్స్ యూనివ ర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో గు రువారం నూతన సంవత్సర వేడుకలు ఘ నంగా జరిగాయి.

వేడుకల్లో దాసేశ్వరరావు పాల్గొని, కేక్ కట్ చేసి, విద్యార్థులకు, అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేవలం పట్టాలు పొందడమే విద్య ఉద్దేశ్యం కాదని, విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడమే విద్య ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యా లను పెంపొందించుకోవాలని సూచించారు.