30-09-2025 01:02:41 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 29 (విజయశాంతి) యువత పట్టుదలతో కష్టపడి చదివ డంతో పాటు గొప్ప స్థాయికి ఎదగాలని అం క్షాంక్ష ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని వేములవాడ ఎమ్యేల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు..
వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ కి చెందిన నిరుపేద గీత కార్మిక కుటుంబానికి చెందిన యువకు డు విష్ణువర్ధన్ గ్రూప్ వన్ ఫలితాల్లో 189వ ర్యాంకుతో సత్తా చాటి సిద్దిపేట కలెక్టరేట్లో అ సిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టడంతో వారిని రాష్ట్ర ప్రభుత్వ విప్ అభినందించారు.
చిన్నతనం నుండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మోటివేషన్ క్లాసులు వినడం ద్వారా తాను కూడా ఉన్నత ఉద్యో గం సివిల్ సర్వీసెస్ చేపట్టాలన్న లక్ష్యం ఏర్పడడంతోనే విష్టువర్థన్ గ్రూప్ 1 లో ఉద్యోగం సాదించారనితెలిపారు..