13 May, 2026 | 1:50 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

యువత స్వయం ఉపాధి సాధించాలి

07-08-2025 12:13 AM
  1. కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి 

హయత్నగర్లో ట్రెయిన్ ట్రస్ట్ శిక్షణా కేంద్రం ప్రారంభం

ఎల్బీనగర్, ఆగస్టు 6 : యువత స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన యువతీయువకుల కోసం ట్రెయిన్ ట్రస్టు ఆధ్వర్యంలో హయత్నగర్ మదర్ డైరీ రోడ్, నయారా పెట్రోల్ పంప్ వెనుక భాగంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ట్రస్టు సీఈవో అమిషా ప్రభు, హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. వికలాంగులు, సామాజికంగా వెనుకబడిన యువతీయువకులకు ఉపాధి ఆధారిత శిక్షణ తీసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ట్రెయిన్ ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఫౌండర్ శ్రీనివాస్, నర్సింహ, దీక్ష, ట్రెయిన్ ట్రస్టు సిబ్బంది అఖిల్, శిరీష, ఉపేందర్, రాజశేఖర్, పవన్, సుమిత, దీపిక, వినయ్ తదితరులుపాల్గొన్నారు.