14-08-2025 01:55:00 AM
ములుగు జిల్లా రవాణా శాఖ అధికారి బారగడి శ్రీనివాస్
ములుగు, ఆగస్టు13 (విజయక్రాంతి): ములుగు జిల్లారవాణా శాఖ జిల్లా అధికారి బారగాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంను జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో ఏర్పాటు చేయడం జరిగింది.రవాణా శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,యువతకు సూచించారు.
గంజాయి అలాంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నా వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలుపాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపినారు. సమావేశానికి హాజరైన వారందరితో నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని,నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా,
చేసే వ్యక్తులు సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తా నని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగా స్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను,యువతతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించినారు. కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది, యువత, తదితరులు పాల్గొన్నారు.