14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు

23-10-2025 01:57 AM

రామచంద్రాపురం, అక్టోబర్ 22 :రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా నవంబర్ నెలలో వజ్రోత్సవాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్, ఎంఈవో పిపి రాథోడ్ తో కలిసి ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన రామచంద్రపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన వేలాదిమంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. నవంబర్ నెలలో పాఠశాల ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా వజ్రోత్సవాల పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.