8 July, 2026 | 8:03 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

120 టన్నుల ఇసుక డంప్ సీజ్

17-07-2025 01:07 AM

హుస్నాబాద్, జూలై 16 :  ఇసుక అక్రమ రవాణాపై సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్కన్నపేట మండల కేంద్రంలో డంప్ చేసిన 120 టన్నుల ఇసుకను సిద్దిపేట టాస్క్ఫోర్స్, అక్కన్నపేట పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

అక్కన్నపేటకు చెందిన మిడిమాలపు సాంబరాజు ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఆకస్మిక దాడి చేసి ఇసుక  డంపు తో పాటు ఒక ట్రాక్టర్ను కూడా సీజ్ చేశారు.