1 August, 2026 | 6:59 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

తెల్లబోతున్న పత్తి రైతు

29-10-2025 12:37 AM
  1. తేమ శాతంపై నకిరేకల్‌లో రహదారిపై ఆందోళన
  2. నడిరోడ్డుపై పత్తిని తగలబెట్టిన రైతులు

నకిరేకల్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పత్తి కొనుగోళ్లలో తేమ శాతం ఎక్కువగా ఉంటే కొనబోమని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నకిరేకల్--అర్వపల్లి రహదారిపై పత్తి రైతులు ఆందోళనకు దిగారు.

శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ టీఆర్‌ఆర్ కాటన్ మిల్ వద్దకు రైతులు పత్తి తీసుకొచ్చారు. అక్కడ తేమ శాతం 12కు మించి కొనబోమని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లు వద్ద నకిరేకల్--అర్వపల్లి రహదారిపై పత్తిని తగులబెట్టి ఆందోళన చేపట్టా రు. కొనుగోలు కేంద్రాలకు వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసుకొచ్చిన పత్తిని, తేమ శాతం ఎక్కువగా ఉంద నే సాకుతో తిరిగి వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

పంట పండించడం ఒక ఎత్తుయితే.. అమ్మ డం అంతకుమించి భారంగా మారిందని వాపోయారు. సీసీఐ కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిం చారు. ఈ విషయంపై ప్రభుత్వం వెం టనే స్పందించి, తేమ శాతంతో సం బంధం లేకుండా పత్తి కొనాలని డి మాండ్ చేశారు.