27-08-2025 02:17:02 AM
-మండలంలో గుట్టుగా గుడుంబా తయారీ
- గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు
- మద్యానికి బదులు, సారా తాగుతున్న పేదలు
- గుడుంబా మూలలపై దృష్టి సారించని ఎక్సైజ్ శాఖ
బూర్గంపాడు,ఆగస్టు26, (విజయక్రాంతి):మండలంలోని మారుమూల గ్రా మాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్నా నాటుసారా త యారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా త యారీ దారులు గుట్టుచప్పుడు కాకుండా త యారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు.
గుడుంబాను నిరోధించాల్సిన సం బంధిత ఎక్సైజ్ అధికారులు మూలాలపై దృష్టిపెట్టకుండా అడపాదడప దాడులు చే స్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతం లో గుడుంబా తయారు చేసేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ పలు పథకాలను అమలు చేసింది. అయినప్పటికీ కొం దరు గుడుంబా కాయడమే వృత్తిగా పెట్టుకుని గ్రామాల్లో, తండాల్లో జోరుగా దం దాను సాగిస్తున్నారు. గుడుంబా కేవలం పల్లెలు, తండాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణాలకు సైతం పాకింది.
జోరుగా నాటుసారా తయారీ
బూర్గంపాడు మండలంలో నాటుసారా తయారీ జోరందుకుంది. మద్యం ధరలు ఎ క్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరల్లో ల భించే గుడుంబా వైపు మరులుతున్నారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్ కవర్లలో నింపి ర వాణా చేస్తున్నారు. మండల కేంద్రంతో పా టు సోంపల్లి,కృష్ణ సాగర్,అంజనాపురం,పినపాక పట్టి నగర్ తదితర మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ద్విచక్రవాహనాలపై ఇతర గ్రామాలు, పట్టణాల కు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా త యారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారుచేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో గుడుంబా త యారీ పెద్దఎత్తున సాగేది. అప్పట్లో రాష్ట్ర ప్ర భుత్వం తయారీకి అడ్డుకట్ట వేయడానికి బె ల్లం తయారీని నిషేధించింది. దీంతో పాటు సారా తయారీకి అలవాటు పడిన కుటుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు కల్పించారు. అనంతరం వారు సారా తయారీ మానుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవ ల కాలంలో తిరిగి సారా గుప్పు మంటోంది. కొందరు తమ కోసం ఇప్పపువ్వుతో మేలి ర కం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు.
మందుబాబులు నాటుసారా వైపు.
మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మ ద్యం తాగాలంటే వందల రూపాయలు వె చించాల్సి వస్తోంది. క్వాటర్ మద్యం కోనాలన్నా రూ.100కు పైగానే ఖర్చవుతోంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరల్లో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు. పేదలు, కూలీలు నివసించే పలు కాలనీల్లో గుడుంబా ఎక్కువగా తాగుతున్నట్లు తెలుస్తోంది.
గుడుంబాపై నిఘా కరువు
మండలంలో నిషేధిత గుడుంబాపై ఎక్సై జ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబం ధిత శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా తయార వుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అ మ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాత్రులలో గుట్టుగా తయారీ చేస్తూ వివిధ ప్రాం తాలకు సరఫరా చేస్తున్నారు.
కొందరు త క్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చే స్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తండాలపై దాడులు నిర్వహించి సారా అమ్మకాలపై వెతుకుతున్నారు. మూ లాలను వెతకకుండా ఎక్కడో ఒకచోట దా డులు నిర్వహిస్తున్నారు. సారా ఎక్కడ తయా రు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉంది.