03-11-2025 06:16:38 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఊర చెరువు వద్ద చేపల వలకు పెద్ద కొండచిలువ చిక్కింది. చెరువు వద్ద మత్స్యకారులు చేపలు తరలిపోకుండా కొద్ది రోజుల క్రితం పెద్ద జాలివల ఏర్పాటు చేశారు. సోమవారం ఆ జాలి వాల వద్ద చిక్కుకొని ఉన్న పెద్ద కొండచిలువను చూసిన స్థానికులు, రైతులు భయపడ్డారు. ఈ సంఘటన సుల్తానాబాద్ లో కలకలం సృష్టించింది.