17 April, 2026 | 3:25 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఒక్క ఓటే గెలిపించింది

15-12-2025 02:06 AM
  1. ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపు                                         
  2. భక్తళాపురం సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి             

సూర్యాపేట, డిసెంబర్ 14 (విజయక్రాంతి) : జిల్లాలోని పెన్ పహాడ్ మండలం భక్తళాపురం గ్రామపంచాయతీ జరిగిన ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జుట్టు కొండ యమునాగణేశ్ పోటీకి దిగారు. అలా గే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నల్లపు శేషలక్ష్మి రామ్మూర్తి పోటీలో నిలిచారు. ఇద్దరు ఒకే సామాజికవర్గం కావడం అదే సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండడానికి తోడు ఇరు పార్టీలు దాదాపుగా సమానంగా ఉన్నాయి.

దీంతో లెక్కింపు ప్రారంభం నుంచి నువ్వా.. నేనా అన్నట్లు పోటీ కొనసాగింది. దీంతో చివరికి యమునా గణేశ్‌కి ఒక్క ఓటు ఎక్కువ రాగా రీ కౌంటింగ్ పె ట్టారు. తిరిగి అదే ఫలితం రావడంతో అధికారులు ఆమెనే సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి నట్లు ప్రకటించారు.దీంతో ఒక్క ఓటే గెలిపించిందని ఓటు విలువ ఈ ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు చర్చించుకున్నారు. కాగా ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరకు ఒక్క ఓటుతో  యమునా గెలుపొందడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.