2 September, 2026 | 11:23 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

దర్శనానికి మూడు గంటల నిరీక్షణ

19-05-2024 | 01:59am

యాదాద్రి భువనగిరి, మే18 (విజయక్రాంతి) : యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. ప్రత్యేక దర్శనం, ధర్మదర్శనం క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పట్టినట్టుగా భక్తులు తెలిపారు. ఆలయంలో వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, బాలబోగం, అభిషేకం అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ మండ పంలో నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణం ఘనంగా నిర్వహించారు. 

అలరింంచిన సంగీత కార్యక్రమం

యాదగిరి కొండపై ప్రతి శనివారం భక్తులను ఆహ్లాదపరచడానికి ఏర్పాటు చేస్తున్న ధార్మిక, సాహిత్య, సంగీత కార్యక్ర మాల్లో శనివారం సాయంత్రం భక్తి సంగీతం ప్రేక్షకులను అలరింపచేసింది. కుమారి ఊర్జిత పటేల్ భక్తి సంగీత గానం చేశారు.

నిత్యాదాయం రూ. 51.82 లక్షలు

 స్వామివారికి ఆదాయం రూ. 51,82,41లక్షల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,04, 550, కైంకర్యాల ద్వారా రూ. 2,200, సుప్రభాత దర్శనాల ద్వారా రూ. 22,600, బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 3,90,900, వ్రత పూజల ద్వారా రూ. 2,73,600, వాహన పూజల ద్వారా రూ. 9,400, వీఐపీల దర్శనాల ద్వారా రూ. 8,55,000, ప్రచార శాఖ రూ. 38,700, పాతగుట్ట ద్వారా రూ. 43,940, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా 6,00,000, యాదరుషి నిల యం రూ. 2,55,234, సువర్ణ పుష్పా ర్చనల ద్వారా రూ. 1,19,148, శివాల యం ద్వారా రూ. 12,300, పుష్కరిణీ ద్వారా రూ. 1,600, ప్రసాదాల విక్ర యం ద్వారా రూ. 18,86,640, కల్యాణకట్ట ద్వారా రూ. 1,46,000, ఆలయ పునరుద్ధరణ నిధి రూ. 6,400, లాకర్స్ రూ. 480, లీజెస్ రూ. 1,16,286, అన్నదానం ద్వారా రూ. 63,153 ఆదాయం సమకూరినట్టుగా పేర్కొన్నారు.