17-01-2026 12:26:33 AM
కేసముద్రం, జనవరి 16 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకుడు దుర్మరణం పాలన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మేతరాజు పల్లి మార్గంలో శుక్రవారం జరిగింది. ఈ సంఘటనలో ఇనుగుర్తికి చెందిన సంగెం శివ (24) అక్కడికక్కడే దుర్మరణం పాలు కాగా సంగెం భరత్ అనే మరో యువకుడు తీవ్రంగా గా యపడ్డాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి అ న్నారం షరీఫ్ దర్గాలో మొక్కులు సమర్పించుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుం డగా ఈ ప్రమాదం జరిగింది.