14-03-2025 12:20:39 AM
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, మార్చి 13: (విజయకాం తి): ఆమ్ ఆద్మీ పార్టీ వలంటీర్ల మనోబలా న్ని దెబ్బ తీయడానికి మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుతో కుమ్మక్కుయి తప్పుడు కేసులు బానాయించి పజా గొంతుక అయిన నహీం పాషా, రాజేందర్ లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడాన్ని తాము తీవంగా ఖండిస్తున్నామన్నామని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు.
ఈ మేరకు గురువారం లిబర్టీలోని ఆఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ.. గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద వేస్తున్న అకమ కేసు లు, నిరంతర దాడులు వీటి గురించి మేము ఇంతకుముందే డిజిపి ఇతర పోలీసు అధికారులకు తెలియచేయడం జరిగింది.
గుండా లు దాడులు చేస్తున్నా మా పార్టీ కార్యకర్తలు పజలకు మరింత చేరువ అవుతున్న సమయంలో, ప్రజలకు మరింత ఉపయోగా రమైన కార్యకమాలు చేయడం, అధికారుల ను పశ్నించడం, ఇవన్నీ అక్కడ ఉన్న అధికారులకు కంటి తుడుపుగా మారాయన్నారు.
అధికారులను కానీ డిపార్ట్మెంట్ వారిని పశ్నిస్తున్నారనే ఉద్దేశంతో ఎలా నైనా పార్టీ కార్య కమాలను ఆపాలని కక్షపూరిత ఉద్దేశంతో మా పార్టీ కార్యకర్తల మీద అనేక రకమైన అసత్య, అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందన్నారు. కార్యకమాలను అడ్డుకునే విధంగా చేయడం కోసం జిల్లా పార్టీ నాయకులు నయీమ్ భాష, రాజేందర్, నాగేందర్లను అరెస్ట్ చేయడం జరిగిందని, ఇలాంటి అకమ అరెస్టులతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను భయభాంతులకు గురిచేయాలని, కార్యకమాలని ఆపాలని పోలీసుల ముఖ్య ఉద్దేశమన్నారు.
దీనికి స్థానిక ఉజు మద్దతు, ఇలాంటి అరెస్టులు అకమ కార్యకమాలతో ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకోలేరని అన్నారు. ఇలాంటి సమయంలో పార్టీ కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పార్టీ కార్యకమాలు చెపుడుతార న్నారని హెచ్చరించారు.