1 September, 2026 | 1:23 AM

సీపీఐ కార్యకర్తలకు సభ్యత్వ కార్డుల పంపిణీ

14-03-2025 12:19 AM

ఎల్బీనగర్, మార్చి 13 : సీపీఐ నాయకు లు, కార్యకర్తలకు 2025 సంవత్సర సభ్యత్వ కార్డులు అందజేశారు. న్యూ నాగోల్‌లోని ఎస్‌ఏ డాంగే భవన్ లో కొత్తపేట డివిజన్, మోహన్ నగర్ శాఖ ఆధ్వర్యంలో గురువా రం సీపీఐ శ్రేణులకు  సభ్యత్వం కార్డులు అందజేశారు.

కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి ఉడుతల మల్లేశ్, సిపిఐ మేడ్చల్ జిల్లా సమితి సభ్యులు, బొడ్డుపల్లి కృష్ణ,  నాయకు లు ఎ.ఆంజనేయులు, బరిగేలా కృష్ణ, ఎస్. సుగుణ, కె.రవి, ఎండీ హైమద్, పి.మధు, జగన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.