13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఫిగర్ స్కేటింగ్‌లో అభిజిత్‌కు స్వర్ణం

26-01-2026 01:56 AM

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్

లేహ్, జనవరి 25 : లడాఖ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026లో యువ క్రీడాకారులు అదరగొడుతున్నారు. అద్భుతమైన ప్రదర్శలతో పత కాలు సాధిస్తున్నారు. తొలిసారి ఈ పోటీల్లో చోటు దక్కించుకున్న ఫిగర్ స్కేటింగ్‌లో కేరళకు చెందిన అభిజిత్ అమల్ రాజ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫిగర్ స్కే టింగ్ తొలిసారి చేర్చబడినప్పటకీ ఎనిమిది రాష్ట్రాల నుంచి 23 మంది స్కేటర్లు పాల్గొన్నారు.

వీరిలో హర్యానా నుంచి అత్యధి కంగా ఎనిమిది మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, ఉత్తరాఖండ్ నుంచి నలుగురు ఉన్నారు. ఆసక్తికరంగా సాగిన ఈ పోటీల్లో అడ్వాన్సడ్ ఫిగర్ స్కేటింగ్ విభాగంలో అభిజిత్ అగ్రస్థానం లో నిలిచి బంగా రు పతకం సాధించాడు. గతంలో 2019 వరల్డ్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2023, 2025 ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లోనూ,  2023 వరల్ స్కేట్ ఓషియా నియా అండ్ పసిఫిక్ కప్‌లో అభిజిత్ స్వర్ణ పతకాలు గెలిచారు. యువ స్కేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మరో స్కేటర్ వకాస్య లక్ష్మీ నారాయణన్త్‌తో కలిసి అకాడమిని కూడా స్థాపించాడు.