26 March, 2026 | 1:58 PM

Breaking News

ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది సున్నా   •   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •  

బ్యాంకు మోసం కేసులో తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్

05-08-2024 10:02 PM

హైదరాబాద్: బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుడు చలపతి రావు అనే వ్యక్తి మారువేషాలతో తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్ లోని ఓ ఎస్బీఐ బ్యాంకులో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన నిందితుడు చలపతి రావు నకిలీ పత్రాలతో బంధువులకు రూ.50 లక్షలు రుణం ఇప్పించాడు. 2002లో బంధువులకు రుణం ఇప్పించిన నిందితుడు చలపతి రావుపై సీబీఐ 2004లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. పేర్లు, వేషాలు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్న చలపతి రావు జీమెయిల్, ఫోన్ నంబర్లను ట్రాక్ చేసిన పోలీసులు నిందితుడు శ్రీలంక పారిపోతున్నట్లు గుర్తించారు. నిందితుడు చలపతిరావును పోలీసులు ఆదివారం తమిళనాడులో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు.