13-08-2024 03:58:27 PM
హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎస్సీ, మైనార్టీ, బీసీ హాస్టల్స్ లో తనిఖీలు జరుగుతున్నాయి. ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్ స్పెక్టర్, పే అండ్ అకౌంట్స్ శాఖల అధికారులు సోదాలలో పాల్గొన్నారు.