05-12-2025 12:00:00 AM
బూర్గంపాడు, డిసెంబర్ 4,(విజయక్రాంతి):మండలంలోని సంజీవరెడ్డి పాలెం లోని శ్రీ లక్ష్మీనరసింహ కాటన్ ఇండస్ట్రీ సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏడిఎ తాతారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి నరేందర్, సిసిఐ బయ్యర్ సంజీవరావు, గ్రామ సర్పంచ్ బాదం వెంకటేశ్వర రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, గోవింద్ రెడ్డి,పత్తి రైతులు పాల్గొన్నారు.